Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
అమెరికాలో పశ్చిమ రాష్ట్రమైన నెవాడాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో మెడికల్ ట్రాన్స్పోర్ట్ విమానం కుప్పకూలడంతో అందులో రోగితో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నెవాడా సరిహద్దులో శుక్రవారం రాత్రి విమానం రాడార్ నుంచి బయటపడిందని ఓ ప్రకటన ద్వారా తెలిసింది. విమానంలో ఉన్న ఐదుగురిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని సెంట్రల్ లియోన్ కౌంటీ అగ్నిమాపకశాఖ ప్రకటించింది. దీనిలో పైలట్తో పాటు విమానంలో ఒక నర్సు, ఒక పారామెడిక్, ఒక రోగి, ఒక రోగి కుటుంబ సభ్యుడు ఉన్నారని ఆర్ఈఎంసీఏ హెల్త్ తెలిపింది.