Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పశ్చిమబెంగాల్
కోల్కతాలో ఓ విద్యార్థిని కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. కోల్కతాలోని హావ్డా వంతెన సమీపంలో బిజీ రోడ్డు వద్ద ఓ విద్యార్థిని పాఠశాల యూనిఫాంలో ఏడుస్తుంది. అటుగా వెళ్తున్న పలువురిని సాయం కోరుతోంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో భయపడుతుంది. దీనీనీ ఈ సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సౌవిక్ చక్రవర్తి గమనించాడు. సమస్య ఏమిటో తెలుసుకునేందుకు ఆమె వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థినిని మందలించగా తాను 10వ తరగతి పరీక్షలు రాస్తున్నానని, శాయంబజార్లోని ఆదర్శ్ శిక్ష నికేతన్ పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి సాయం చేయాలని కోరింది.
మీ ఇంట్లో వారు తోడు రాలేదా అని అధికారి ప్రశ్నించగా తన తాత చనిపోవడంతో కుటుంబ సభ్యులందరూ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్లినట్లు తెలిపింది. దీంతో స్పందించిన ఇన్స్పెక్టర్ వెంటనే ఆ విద్యార్థినిని తన అధికారిక వాహనంలో ఎక్కించుకున్నాడు. పరీక్షా కేంద్రం వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాల్సిందిగా ట్రాఫిక్ కంట్రోల్కు చకచకా ఆదేశాలు జారీ చేశాడు.
ఈ తరుణంలో ఇన్స్పెక్టర్ సౌవిక్ చక్రవర్తి మాట్లాడుతూ నా కూతురు 11వ తరగతి చదువుతోంది. అందుకే ఓ విద్యార్థిని పడే బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నాను. నేను ఆమెను చూసినప్పుడు సమయం 11.20. తక్షణమే స్పందించి 11.30కల్లా ఆ విద్యార్థినిని పరీక్షా కేంద్రానికి చేర్చాను. ఆమెను అధికార వాహనంలో కాకుండా మరో వాహనంలో పంపించవచ్చు. కానీ, ఆమె సమయానికి పరీక్ష రాసేది కాదు. అందుకే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆదేశించాను. మేము బయలుదేరి వెళ్తున్న సమయంలో ఆ విద్యార్థిని చాలా ఆందోళన చెందుతోంది. ఏం పర్లేదు. ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చానని తెలిపారు.