Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ నూతన దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ (31) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జోసెఫ్.. కేరళ అలువాలోని రాజగిరి ఆస్పత్రిలో హెపటైటిస్కు చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు.
కాగా జోసెఫ్ మను ‘ఐయామ్ క్యూరియస్’ సినిమాతో బాలనటుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీ 2004లో రిలీజైంది. కొన్నేళ్ల తర్వాత జోసెఫ్ సినీపరిశ్రమ మీద ఉన్న ఆసక్తితో పలు మలయాళ, కన్నడ, హిందీ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించారు. ‘నాన్సీ రాణి’ సినిమాతో పూర్తిస్థాయిలో దర్శకుడిగా పరిచయం కానున్నారు. తను తెరకెక్కించిన సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అహానా క్రిష్ణ, అర్జున్ అశోకన్ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే, తన తొలి సినిమా చూడకముందే జోసెఫ్ మరణించడంతో చిత్రయూనిట్ తీవ్ర విచారం వ్యక్తం చేసిందిజేమ్స్ మృతిపై అహానా కృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు పెట్టారు. ‘చాలా త్వరగా వెళ్లిపోయావ్ బ్రదర్’ అంటూ అజు వర్ఘీస్ సంతాపం తెలిపారు.