Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గోషామహల్
ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు తరచు మొరాయిస్తోందని పలుమార్లు ఆయన సీఎం కేసీఆర్, డీజీపీ, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పాత వాహనాన్ని ఇటీవలే ప్రగతిభవన్కు తీసుకువెళ్లి అక్కడే వదిలిపెట్టి వచ్చారు. ఈ తరుణంలో రాజాసింగ్కు పోలీసులు సోమవారం మరొక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చారు.