Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కాల్స్, డేటా రేట్లను పెంచాలని భావిస్తున్నట్లు భారతి ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. టెలికామ్ బిజినెస్ లో వచ్చే లాభాలు చాలా తక్కువ అని, ఈ ఏడాది టారీఫ్ లు పెంచుతామని తెలిపారు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఆయన మాట్లాడారు.
ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. చాలా మూలధనాన్ని కంపెనీ తీసుకొచ్చింది. అదే బ్యాలెన్స్ షీట్ ను బలంగా చేసింది. అయితే పరిశ్రమలో మూలధనంపై రాబడి చాలా తక్కువగా ఉంది. దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. భారతీయ టారీఫ్ పరిస్థితిలో రావాల్సిన చిన్న మార్పుల గురించే మాట్లాడుతున్నాం. ఈ సంవత్సరం పెంపు ఉంటుందని నేను ఆశిస్తున్నా అని వివరించారు.