Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భోపాల్
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో ఓ వ్యక్తి మొబైల్ పేలి మరణించాడు. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని బాద్నగర్ పట్టణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుడిని (68) దయారాం బరోద్గా గుర్తించారు. మృతుడి ముఖం, శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
దయారాం బరోద్ తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాల్సి ఉండగా అతడి ఫ్రెండ్ పలుమార్లు ఫోన్ చేసినా బరోద్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో బరోద్ ఫ్రెండ్ నేరుగా అతడి ఇంటికి రాగా బరోద్ విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద మొబైల్ ఫోన్ పీస్లు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. ఫోన్ చార్జింగ్లో ఉండగా అతడు ఎవరితోనో మాట్లాడుతున్నాడని, అదే సమయంలో బ్యాటరీ పేలిపోయిందని అనుమానిస్తున్నారు. పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం బాధితుడి మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు.