Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 10 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోందని టిటిడి పేర్కొంది. కాగా, గురువారం స్వామివారిని 60,682 మంది భక్తులు దర్శంచుకున్నారు. 24,291 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్శించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.32 కోట్లు అని ఆలయ అధికారులు వెల్లడించారు.