Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-విజయవాడ: భవానీపురంలోని అశోకా ట్రేడర్స్కు చెందిన గృహోపకరణాల గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం గోదాము నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం గోడౌన్లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని చెబుతున్నారు. ఇళ్ల మధ్యనే గోదాము ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనం లోపలికి వెళ్లేందుకు ఒకే దారి ఉండటంతో మంటలార్పడం ఫైర్ సిబ్బందికి కష్టంగా మారింది.