Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అమెరికాలో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో ఓ ఎన్నారై దుర్మణం చెందారు. ఆమె కూతురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. పైలట్ ట్రైనింగ్పై ఆసక్తిగల వారి కోసం ఉద్దేశించిన డెమాన్స్ట్రేషన్ ఫ్లైట్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో రోమా గుప్తా(63), ఆమె కూతురు రీవా గుప్తా(33) ఉన్నారు. ప్రమాదానికి ముందు కాక్పిట్లో పొగ వస్తున్న విషయాన్ని పైలట్ గ్రౌండ్ కంట్రోల్కు తెలియజేశాడు. ఆ తరువాత కొద్ది సేపటికే విమానంలో మంటలు రేగడంతో అది న్యూయార్క్ ఏరియాలో కూలిపోయింది. లాంగ్ ఐల్యాండ్లోని రిపబ్లికన్ ఎయిర్పోర్టుకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ విమానం డానీ వైజ్మ్యాన్ ఫ్లైట్ స్కూల్కు చెందినదిగా తేలింది. ఈ ప్రమాదంపై డానీ వైజ్మ్యాన్ ఫ్లైట్ స్కూల్ లాయర్ స్పందించారు. విమానానికి అన్ని భద్రతాపరమైన తనీఖులూ జరిగాయని, ఎటువంటి లోపం బయటపడలేదని పేర్కొన్నారు. గతవారం చివరిసారిగా విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డుతో పాటూ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా దర్యాప్తు ప్రారంభించింది. మంగళవారం వారు మరోమారు విమానం కూలిపోయిన ప్రదేశాన్ని సందర్శించనున్నారు.