Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కరీంనగర్
జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మానేరు నది పై కొత్తగా నిర్మించిన తీగల వంతెన వద్ద ఈత కోసం వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందారు. సంఘటనా స్థలంలో మరో బాలుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న తిమ్మాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చేపట్టారు.
ఈ తరుణంలో వాగులో నుంచి ముగ్గురు బాలుర మృతదేహాలను వెలికి తీశారు. మృతులను కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. హోలీ పండుగ సందర్భంగా సెలవు కావడంతో నలుగురు బాలురు కలిసి సరదాగా ఈతకొట్టేందుకు తీగల వంతెన వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే నీటిలో మునిగిపోయినట్లుగా తెలుస్తున్నది. ప్రమాదం, మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.