Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ పేలుడు సంభవించింది. ఓ ఏడంతస్తుల భవనంలో సంభవించిన పేలుడు ధాటికి 14 మంది మృతి చెందారు. 70 మంది గాయపడ్డారు. పాత ఢాకా గులిస్థాన్ ప్రాంతంలోని సిద్ధిక్ బజార్ వద్ద ఈ ఘటన జరిగింది. ఘటన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పేలుడుకు కారణం స్పష్టంగా తెలియకపోయినా, ఆ భవనంలో రసాయనాలు అక్రమంగా నిల్వచేస్తున్నారని, పేలుడు రసాయనాలే కారణం అయ్యుండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి సిద్ధిక్ బజార్ మొత్తం ఊగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భూకంపం సంభవించి ఉంటుందని భావించినట్టు సఫాయత్ హుస్సేన్ అనే వ్యక్తి వెల్లడించాడు.