Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇండియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన టీమిండియా మూడో టెస్టులో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోకామెంటరీ బాక్స్ లో ఉన్న టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డారు. అతి విశ్వాసమే టీమిండియా ఓటమికి కారణమని శాస్త్రి అన్నారు. దీంతో తాజాగా రోహిత్ శర్మ మాట్లాడుతూ బయటి వ్యక్తులు చేసే చెత్త వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. వాస్తవాలు మాట్లాడుకుంటే తొలి రెండు టెస్టుల్లో తాము గెలిచామని, బయటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు చెత్తగా ఉన్నాయని విమర్శించాడు. ప్రతి మ్యాచ్ లో ఉత్తమ ప్రదర్శనను ఇచ్చేందుకే తాము కృషి చేస్తామని తెలిపారు.