Authorization
Wed April 30, 2025 04:54:36 am
నవతెలంగాణ - న్యూఢిల్లీ: మునుపెన్నడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంకకు ఇతర దేశాలేవీ చేయనంత గొప్ప సహాయాన్ని భారత దేశం చేసిందని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రి కొనియాడారు. కష్టకాలంలోనే నిజమైన స్నేహితులెవరో తెలుస్తుందన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నపుడు భారత దేశం తమకు అండగా నిలిచిందని చెప్పారు. అవసరంలో స్నేహంగా ఉన్నవారే నిజమైన స్నేహితులని చెప్పారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు అండగా నిలవడం కోసం భారత ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని, అందువల్ల భారత దేశానికి తాము ఎంతో కృతజ్ఞులమని తెలిపారు.