Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మిశ్రమంగా ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఉదయం 9.23 సమయంలో సెన్సెక్స్ 90 పాయింట్ల నష్టంతో 60,251 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 17,735 వద్ద ట్రేడవుతున్నాయి. తొలుత లాభాల్లోకి వెళ్లిన సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకొన్నాయి. సీక్వెంట్ సైంట్ఫిక్, అదానీ విల్మర్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్ షేర్ల విలువ పెరిగింది. హోం ఫస్ట్ ఫైనాన్స్, డిష్టీవీ, క్రిసిల్ షేర్ల విలువ కుంగింది. డాలర్తో రూపాయి మారకం విలువ 18 పైసలు విలువ కోల్పోయి రూ. 81.89 వద్ద కొనసాగుతోంది.