Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతున్న విషయం విదితమే. ఎస్సీటీ ఎస్ఐ(ఐటీ అండ్ సీవో), ఎస్సీటీ ఏఎస్ఐ (ఎఫ్పీబీ)పోస్టులకు టీఎస్ఎల్పీఆర్బీ శనివారం రాత పరీక్ష నిర్వహించింది.
ఈ ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులకు ఉదయం, మధ్యాహ్నం రాతపరీక్షలు నిర్వహించగా, మొత్తం 77.93 శాతం మంది హాజరయ్యారు. ఎస్సీటీ ఎస్ఐ(ఐటీ అండ్ సీవో) పోస్టులకు 4099 మంది దరఖాస్తు చేసుకోగా, 3233 మంది(78.87 శాతం) హాజరయ్యారు. ఎస్సీటీ ఏఎస్ఐ (ఎఫ్పీబీ) పోస్టులకు 2008 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1526(76 శాతం) మంది హాజరయ్యారు. ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు.