Authorization
Thu May 01, 2025 10:06:00 am
నవతెలంగాణ - కడప
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ మరోసారి నోటీసులు ఇస్తే విచారణకు హాజరవుతానని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డి తెలిపారు. 12న విచారణకు రావాలంటూ ఆయనకు సీబీఐ నోటీసులు ఇచ్చిన తరుణంలో కడప కేంద్ర కారాగారం అతిథిగృహం వద్దకు వచ్చారు. అక్కడ సీబీఐ అధికారులు లేకపోవడంతో భాస్కర్రెడ్డి తిరిగి వెళ్లిపోయారు.
ఈ క్రమంలో భాస్కర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విచారణ తేదీని మళ్లీ తెలియజేస్తామని అధికారులు చెప్పినట్లు తెలిపారు. హత్య జరిగిన స్థలంలో లభ్యమైన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. అవినాష్రెడ్డితో పాటు మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటామంటూ సీబీఐ తరఫున న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు తెలియజేసిన అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తాము దేనికైనా సిద్ధమని భాస్కర్రెడ్డి వ్యాఖ్యానించారు.