Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిం చాలని విద్యాశాఖ నిర్ణయించింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొంటూ సోమ వారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్ర భుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాల ల్లో ఉదయం 8 గంటల నుంచి మ ధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నది. ప్రభుత్వ బడుల్లో 12.30 గం టలకు తప్పనిసరిగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని సూచించింది. పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టంచేసింది. పదోతరగతి పరీక్ష కేంద్రాల బడుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.