Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: పట్టణాల్లో దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలు ఆ స్థలాలను క్రమబద్ధీకరించుకొనేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. వారికి హక్కులు కల్పించేందుకు మరోసారి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. అదేవిధంగా సింగరేణి సంస్థకు చెందిన భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నవారికి కూడా మరోసారి క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించింది. పేదల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జీవో 58, జీవో 59 కింద భూముల క్రమబద్ధీకరణ, హక్కుల బదలాయింపు కోసం మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. కటాఫ్ తేదీని సైతం 2020 జూన్ 2 వరకు పొడిగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ శుక్రవారం జీవో నంబర్ 28, 29 జారీ చేసింది. పట్టణాల్లోని భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు 30 రోజులు అవకాశం ఇవ్వగా, సింగరేణి పరిధిలో దరఖాస్తులకు 3 నెలలు అవకాశం ఇచ్చింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో జీవో 58, 59 కింద పట్టణ పేదలకు మరోసారి అవకాశం కల్పించాలని, కటాఫ్ తేదీని పొడిగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.