Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ను స్పెషల్ కోర్టు పొడిగించింది. మార్చి 28 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. రాఘవరెడ్డి జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. ప్రస్తుతం రాఘవరెడ్డి తీహార్ జైలులో ఉండటం గమనార్హం. అతనిని ఈరోజు సీబీఐ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ పురోగతిలో ఉందని.. కాబట్టి మాగుంట రాఘవరెడ్డికి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు సీబీఐ కోర్టులో విజ్ఞప్తి చేశారు. ఈడీ అభ్యర్థన మేరకు మార్చి 28 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కాసేపటి క్రితమే సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సౌత్గ్రూప్లో రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు విచారణలో నిర్ధారించిన ఈడీ అధికారులు ఆపై అతనిని అదుపులోకి తీసుకున్నారు. పది రోజుల పాటు ఈడీ కస్టడీలోకి తీసుకుని మాగుంటను విచారించింది. విచారణ అనంతరం జ్యుడీషియల్ కస్డడీకి తరలించారు. తాజాగా జ్యుడీషియల్ కస్డడీ ముగియడంతోనే మరో 11 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది.