Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఉదయం 10:30 గంటల సమయంలో ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లిన కవిత దాదాపు 10:30 గంటల విచారణ తర్వాత రాత్రి 9:14 గంటల సమయం బయటకొచ్చారు. కేసీఆర్ నివాసానికి బయలుదేరారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆమెను అధికారులు పంపించారు. సోమవారం విచారణలో పలు కీలక ప్రశ్నలను అధికారులు సంధించినట్టు తెలుస్తోంది. మొత్తం 20 ప్రశ్నలు సంధించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉదయం రామచంద్ర పిళ్లైతో కలిపి ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఇక సాయంత్రం నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, అమిత్ అరోరాలతో కలిపి కవితను ప్రశ్నించినట్టు పలు రిపోర్టులు వెలువడ్డ విషయం తెలిసిందే.