Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. వైద్య ఖర్చులు భారం కావడంతో 24 ఏండ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నితేశ్ కు వైద్య ఖర్చులు భారంగా మారాయి. దీంతో మానసికంగా కుంగిపోయిన అతడు నార్త్ ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ లో ఓ హోటల్ రూమ్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఘటనాస్థలి వద్ద నితీశ్ రాసిన ఓ సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యం తడిసిమోపెడవుతున్న వైద్య ఖర్చులు తనను మానసింగా కుంగదీసినట్టు యువకుడు తన లేఖలో పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు వెల్లడించాడు. అయితే నొప్పి లేకుండా ఆత్మహత్య ఎలా చేసుకోవాలో తెలుసుకునేందుకు అతడు ఆన్లైన్లో వెతికినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనో ఆక్సిజన్ పాయిజనింగ్ గురించి అతడికి తెలిసిందని వివరించారు.