Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జమ్ముకశ్మీర్
ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ పోలీసులు సోపోర్లోని పెత్ సీర్ రైల్వే స్టేషన్ సమీపంలో సయుక్తంగా గాలింపు చేపట్టారు.
ఈ తరుణంలో భద్రతా దళాలను చూసి ఓ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతడిని ఉమర్ బషీర్ భట్గా గుర్తించారు. అతడు లష్కరే తొయీబా ఉగ్రసంస్థలో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతని నుంచి హ్యాండ్ గ్రనేడ్, పిస్తోల్, పిస్తోల్ మ్యాగజైన్, 15 పిస్తోల్ లైవ్ రౌండ్లు, మొబైల్ ఫోన్, ఒక సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నామని, అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదుచేశామన్నారు.