Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అక్షయ్కుమార్, టైగర్ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘బడే మియా ఛోటే మియా’. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం స్కాట్లాండ్లో చిత్రీకరణ జరుపుకున్నది. హీరోలిద్దరిపై యాక్షన్ ఘట్టాల్ని చిత్రీకరించారు. స్టంట్స్ పర్ఫార్మ్ చేసే క్రమంలో అక్షయ్కుమార్ మోకాలికి తీవ్ర గాయమైందని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. అయితే బాధలోనే ఆయన షూటింగ్ పూర్తి చేశారని, ముందస్తుగా ఖరారైన షెడ్యూల్ దృష్ట్యా చిత్రీకరణను పొడిగించలేకపోయామని నిర్మాత జాకీ భగ్నానీ తెలిపారు. గాయం కారణంగా యాక్షన్ సీక్వెన్స్కు బ్రేక్నిచ్చి అక్షయ్కుమార్పై కొన్ని క్లోజప్ సీన్లను షూట్ చేశామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రంలో దక్షిణాది అగ్రహీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకురానుంది.