Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్
ఎంజీఎంలో దారుణం చోటుచేసుకుంది. ఒకరి డెడ్ బాడీకి బదులు మరో మృతదేహాన్ని ఎంజీఎం సిబ్బంది ఇచ్చినట్లు మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కాందారిపల్లి వాసి రాగుల రమేష్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈక్రమంలో రమేష్ మృతదేహానికి బదులు మరొకరి డెడ్ బాడీ అధికారులు ఇచ్చిన్నట్లు మృతుడి బంధువులు వాపోతున్నారు. అంత్యక్రియలు చేస్తుండగా గమనించిన బంధువులు ఆందోళనకు దిగారు. ఈ తరుణంలో ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.