Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
నిఖత్ జరీన్ను అభినందించిన సీఎం కేసీఆర్మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో వరుగా రెండోసారి బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభినందించారు. ఢిల్లీలో జరిగిన ఫైనల్లో 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.
నిఖత్ జరీన్ను అభినందించిన సీఎం కేసీఆర్ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో వరుగా రెండోసారి బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభినందించారు. ఢిల్లీలో జరిగిన ఫైనల్లో 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘వియత్నాంకు చెందిన బాక్సర్ న్యూయెన్పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి భారత్కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తన వరుస విజయాలతో దేశఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు.
ప్రపంచ చాంపియన్ పోటీల్లో తన కెరీర్లో ఇది రెండవ బంగారు పతకం కావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అలాగే మంత్రి హరీశ్రావు సైతం నిఖత్ జరీన్ను ప్రశంసించారు. నిఖత్ జరీన్ విజయంతో దేశం గర్విస్తోందన్నారు. పవర్ఫుల్ పంచ్లతో ప్రత్యర్థిని మట్టికరిపించి బంగారు పతకం సాధించిందని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం నిఖత్ జరీన్కు అభినందించారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత జెండా మరోసారి రెపరెపలాడిందని, స్వర్ణ పతకం సాధించి భారతదేశం గర్వపడేలా చేసిందని కవిత ట్వీట్ చేశారు.