Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్ : తేనెటీగల బారి నుంచి తప్పించుకోవడానికి బావిలో దూకిన అన్నదమ్ముల్లో ఈత రాక అన్న మృతి చెందగా తమ్ముడి క్షేమంగా బయటపడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
జిల్లాలోని కొత్తగూడ మండలం ఎదళ్లపల్లి గ్రామానికి చెందిన కొన్రెడ్డి సంజీవ(45), జనార్దన్ అనే అన్నదమ్ములు నీలంపల్లి గ్రామశివారులో పొలం పనులకు వెళ్లారు. ఒక్కసారిగా తేనెటీగలు వీరిపై దాడి చేయగా తప్పించుకోబోయి బావిలో దూకారు. అన్న సంజీవకు ఈతకు రాకపోవడంతో మృతి చెందాడని తమ్ముడు జనార్దన్ ఈదుకుంటూ బయటపడ్డాడని వివరించారు. సంజీవకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.