Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సుప్రసిద్ధ సినీ గాయకులు కేజే ఏసుదాసు కుమారుడు విజయ్ నివాసంలో భారీ చోరీ జరిగింది. 60 సవర్ల బంగారు నగలు, వజ్రాభరణాలను దొంగతనం చేశారు. తమ ఇంట్లో చోరీ జరిగినట్టు విజయ్ భార్య చెన్నైలోని అభిరామపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో పని చేస్తున్నవారే చోరీకి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలను ఆమె తన ఫిర్యాదులో వ్యక్తపరిచారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ నివాసంలో ఇప్పటి వరకు పని చేసిన వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. 60 సవర్ల నగలను చోరీ చేశారు. ఈ కేసులో ఆమె ఇంట్లో పని చేస్తున్న ఒక మహిళను అరెస్ట్ చేశారు.