Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై అఫ్జల్గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామ నవమి శోభాయాత్రలో రాజా సింగ్ ప్రసంగానికి సంబంధించి కేసు నమోదైంది. తన కొడుకుని పరిచయం చేస్తూ ఇతర కమ్యూనిటీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఇతర వర్గాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఎస్ఐ వీరబాబు అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజాసింగ్పై ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెండు వేర్వేరు వర్గాల మధ్య ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు రాజాసింగ్ ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.
అయితే ఇటీవల ముంబైలోనూ రాజా సింగ్పై పోలీసు కేసు నమోదైన విషయం తెలిసిందే. జనవరి 29న ముంబైలో జరిగిన ర్యాలీలో రాజా సింగ్ విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శివాజీ పార్క్ లేబర్ బోర్డు కార్యాలయం మధ్య హిందూ సకల్ సమాజ్ నిర్వహించిన ర్యాలీలో రాజా సింగ్ ప్రసంగాన్ని చూసిన తర్వాత ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు IPC 153A(I)(a) కింద దాదర్ పోలీస్ స్టేషన్ అధికారి కేసు నమోదు.