Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఏప్రిల్ 3 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు ఉదయం 0 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని, పరీక్షలు జరిగే 3,349 పాఠశాలల్లో రెండుపూటలా సెలవులు ఉంటాయన్నారు. ప్రత్యేక కారణం ఉంటే తప్ప పదో తరగతి పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు. హాల్టికెట్ ఆధారంగా విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిచవచ్చని తెలియజేశారు.