Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: అగ్నిమాపక నిబంధనలు పాటించని పలు ఆసుపత్రులు, మాల్స్కి జీహెచ్ఎంసీ ఈవీడీఎం నోటీసులు జారీ చేసింది. నగరంలోని ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు, గోదాములు, స్పోర్ట్స్, ఫార్మా, ప్లాస్టిక్ దుకాణాలు, మాల్స్కు సంబంధించి మొత్తం 19 మందికి నోటీసులు అందజేసింది. న్యూ మలక్పేట డీమార్ట్, మాదాపూర్ కెనరా బ్యాంక్ బిల్డింగ్, మాదాపూర్ లక్కీరెస్టారెంట్, మెహిదీపట్నం బటర్ఫ్లై హాస్పిటల్, మదీగూడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మెహిదీపట్నం చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్కు నోటీసులు ఇచ్చినట్టు జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్రెడ్డి తెలిపారు. సెల్లార్లు ఖాళీ చేయాలని, అత్యవసర ద్వారాలు తెరిచి ఉంచాలని నోటీసులో పేర్కొన్నారు. 3 రోజుల్లోగా నిబంధనలు పాటించకపోతే సీజ్ చేస్తామని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్రెడ్డి తెలిపారు. అక్రమంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న సికింద్రాబాద్లోని ఏఎంఆర్ ప్లానెట్కు రూ.50వేల జరిమానా విధించారు.