Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాంచీ
ఝార్ఖండ్ లోని నక్సల్స్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఛత్రా అడవుల్లో జరిపిన ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు నక్సల్స్ను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. వీరిలో రూ.25లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు అగ్రనేత కూడా హతమైనట్లు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది.
ఈ తరుణంలో భద్రతా సిబ్బందిపైకి మావోయిస్టులు కాల్పులు జరపగా.. జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఎన్కౌంటర్లో ఐదుగురు నక్సల్స్ హతమైనట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో రెండు ఏకే-47 తుపాకులు సహా పెద్దమొత్తంలో ఆయుధాలు లభించినట్లు , చనిపోయిన ఇద్దరు మావోయిస్టులపై రూ.25లక్షల రివార్డు, మరో ఇద్దరు నక్సల్స్పై రూ.5లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు. నక్సల్స్ ముఠాకు చెందిన స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్ పాసవాన్ ఈ ఎన్కౌంటర్లో హతమైనట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అతడి తలపై రూ.25లక్షల రివార్డు ఉంది. అయితే గౌతమ్ మృతిపై అధికారిక ప్రకటన రాలేదు.