Authorization
Wed April 30, 2025 08:41:53 am
నవతెలంగాణ - ఢిల్లీ
ఐపీఎల్-2023లో భాగంగా మంగళవారం అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ను వీక్షించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యూలర్ కెప్టెన్ రిషబ్ పంత్ను అరుణ్జైట్లీ స్టేడియానికి తీసుకొచ్చేందుకు ఢిల్లీ ఫ్రాంఛైజీ ప్రయత్నిస్తోంది. తన జట్టును సపోర్ట్ చేసేందుకు పంత్ స్టేడియం రానున్నాడు. స్పెషల్ బాక్స్లో నుంచి పంత్ మ్యాచ్ను విక్షించన్నుట్లు తెలుస్తోంది. బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రత బృందం అనుమతిస్తే కొంత సమయం అతడు డగౌట్లో కూడా ఉంటాడని ఆ ఫ్రాంఛైజీ వర్గాలు తెలిపాయి.