Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పదో తరగతి ప్రశ్నపత్రాలను బయటకు తీసుకొచ్చిన వైరల్ చేసిన కేసులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను హనుమకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు బుధవారం హాజరుపరిచారు. అయితే పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను వరంగల్ పీటీసీకి తరలించి, అక్కడ్నుంచి కోర్టుకు తరలించారు. కోర్టు వెనుక గేటు నుంచి ఆయనను లోపలికి తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ప్రాంగణంలో పోలీసులు భారీగా మోహరించారు. భద్రత పెంచారు.