Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఢిల్లీ లిక్క్ స్కాంలో రౌస్ ఎవెన్యూ కోర్టు మనీష్ సిసోడియా కస్టడీని పొడిగించింది. జ్యూడిషియల్ కస్టడీని ఏప్రిల్ 17 వరకు పొడిగించింది కోర్టు. అయితే దర్యాప్తు కీలక దశలో ఉందని ఈడీ కోరడంతో కోర్టు జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. ఈ తరుణంలో మనీలాండరింగ్ నేరానికి సంబంధించినంతవరకు ఎటువంటి ఆరోపణలు లేవంటూ మనీష్ సిసోడియా తరపు న్యాయవాది వివేక్ జైన్ కోర్టుకు తెలిపారు.
ఆయన ఇంటిపై దాడి చేసి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేశారని ఇంత వరకు మనీష్ సిసోడియా దగ్గర నేరానికి సంబంధించిన ఒక్క ఆధారం లభించలేదని కోర్టుకు తెలిపారు. పీఎంఎల్ఏ కేసు నమోదు కాలేదని.. సెక్షన్ 3 కింద నేరం జరిగితేనే పీఎంఎల్ఏ సెక్షన్ 45 వస్తుందన్నారు. మనీష్ సిసోడియా ఖాతాలో గానీ, అతని కుటుంబ సభ్యుల ఖాతాకి ఒక్క రూపాయి కూడా రాలేదని తెలిపారు. ఇరు వాదనలు విన్న రౌస్ ఎవెన్యూ కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 12కు వాయిదా వేసింది.