Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిషనర్ను ఆపిన మహిళా కానిస్టేబుల్
- కానిస్టేబుల్ రివార్డ్ ప్రకటించిన సీపీ
నవతెలంగాణ హైదరాబాద్
పదో తరగతి పరీక్ష పత్రాలు లీకేజీ కలకలం నేపథ్యంలో ఎల్బీనగర్లోని పరీక్ష కేంద్రాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహాన్ పరిశీలించారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కి తావులేకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే సమయంలో మొబైల్ తీసుకుని వెళ్తున్న కమిషనర్ చౌహాన్కు.. పరీక్షా కేంద్రంలోకి మొబైల్స్ అనుమతి లేదంటూ కల్పన అనే మహిళా కానిస్టేబుల్ ఆయన్ను ఆపారు. వెంటనే ఆయన తన సెల్ ఫోన్ను ఆమెకు అప్పగించారు. కల్పన చేసిన పనికి సీపీ అభినందించి రివార్డ్ ప్రకటించారు. ఏ అధికారి వచ్చినా ఇలాంటి పటిష్ట బందోబస్తు నిర్వహించాలని ఆయన సూచించారు.