Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ వ్యాపిస్తుండటం కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. అటు మరణాలు కూడా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 6,155 మంది కొవిడ్ వైరస్ బారిన పడగా పాజిటివిటీ రేటు 5శాతం దాటింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాలను (ఎమర్జెన్సీ హాట్స్పాట్స్) గుర్తించి దాని కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. అయితే తాజా వ్యాప్తికి ఎక్స్బీబీ.1.16 లేదా ఆర్ట్కురుస్గా పిలిచే కొత్త వేరియంట్ కారణమని వైద్యరంగ నిపుణలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఈ వేరియంట్కు సంబంధించి 100కు పైనే కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.