Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్ సందర్శన అనంతరం మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ తరుణంలో దేశంలో పులుల సంఖ్యపై నివేదికను విడుదల చేశారు. దేశంలో పులుల సంఖ్య పెరిగిందని తెలిపారు.
2022లో పులుల సంఖ్య 2,967 నుంచి 3,167కి పెరిగిందని వివరించారు. వన్యప్రాణి సంరక్షణలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ అనేక ఘనతలను సాధించిందని తెలిపారు. ఇవాళ పులులు, ఏనుగులు (30 వేలు), ఆసియాటిక్ ఏనులుగు, సింగిల్ హార్న్ ఖడ్గమృగాలు (3 వేలు), ఆసియాటిక్ సింహాల విస్తృతి పరంగా భారత్ అగ్రస్థానంలో మోదీ వెల్లడించారు. గడచిన నాలుగేళ్లలో దేశంలో చిరుత పులుల సంఖ్య 60 శాతం పెరిగిందని తెలిపారు. స్వచ్ఛమైన నదులు జీవ వైవిధ్యానికి ఎంతో తోడ్పతాయని, అందుకే దేశంలో నదులను పరిశుభ్రం చేసే కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.