Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుంటూరు జిల్లా: మంగళగిరి బైపాస్లో రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి మద్యం మత్తులో అతి వేగంగా వస్తున్న బైక్ డివైడర్ను ఢీ కొంది. బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.