Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పెద్దపల్లి
బావిలో పడిన పెంపుడు పిల్లిని కాపాడబోయిన ఓ మహిళ.. ప్రాణం కోల్పోయింది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కిష్టంపల్లెలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. గ్రామంలోని లింగాల లసుము (55) ఇంట్లోని పెంపుడు పిల్లి.. తెల్లవారుజామున ఇంటి ఆవరణలోని చేదబావిలో పడింది. గమనించిన ఆమె బొక్కెనతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. లసుము చిన్న కుమారుడు రాకేశ్ స్థానికుల సాయంతో బయటకు తీసేసరికి ఆమె విగత జీవిగా మారారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై షేక్ మస్తాన్ తెలిపారు.