Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నంద్యాల : శ్రీశైలం దేవస్థానం పరిధిలో అర్ధరాత్రి డ్రోన్ కలకలం రేపింది. ఆకాశంలో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో దేవస్థానం సిబ్బంది అవాక్కయ్యారు. దేవస్థానం అధికారుల అనుమతి లేకుండా ఆకాశంలో డ్రోన్ కెమెరా ఎగురుతుండటాన్ని గుర్తించిన ఆలయ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. అప్రమత్తమైన దేవస్థానం చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ సిబ్బంది డ్రోన్ను పట్టుకునేందుకు రంగంలోకి దిగింది. ఆర్టీసీ బస్టాండు కమ్మ సత్రం, బలిజ సత్రం ఆలయ పరిసరాలలో ఆకాశంలో ఎగురుతూ స్థానికులకు డ్రోన్ కెమెరా కనిపించింది. సత్రాలపైకి ఎక్కిమరి డ్రోన్ ను ఎగరేసినట్టు ఆలయ అధికారులు గుర్తించారు. ఎగురవేసిన వారికోసం సెక్యూరిటీ సిబ్బంది వెదుకుతోంది.