Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బీహార్ రాష్ట్రంలోని మోతిహారిలో శనివారం కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించారు.ఈ ఘటనలో మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. బీహార్లోని మోతీహరి జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో కల్తీ మద్యం తాగి మరో 12 మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలయ్యారు. సంపూర్ణ మద్యనిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో తరచూ కల్తీ మద్యం తాగడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ ఘటనపై బీహార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.