Authorization
Wed April 30, 2025 09:26:00 pm
నవతెలంగాణ - ఉత్తరప్రదేశ్: యూపీలోని శ్రావస్తి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బహ్రైచ్ అస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సోన్రాయ్ గ్రామ సమీపంలో శనివారం ఉదయం ఇన్నోవా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఇన్నోవాలో ఉన్న వారంతా తమ తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పంజాబ్ నుంచి శ్రావస్తిలోని కర్మోహన గ్రామానికి వస్తున్నారు. రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.