Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. భారత్ లోను మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన కేసులు.. సోమవారం మాత్రమే కాస్త క్షీణించాయి. కేంద్ర ఆరోగ్య శాఖ డేటా ప్రకారం నిన్న 7633 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసులు 61,233గా ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,31,152కి చేరుకున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బూస్టర్ డోస్ ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం (ఏప్రిల్ 19) నుండి రాష్ట్ర వ్యాప్తంగా కార్బో వ్యాక్సీన్ ను బూస్టర్ డోస్ గా అందించనున్నట్లు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. ఐదు లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని, అర్హులైన వారు వ్యాక్సీన్ తీసుకోవాలని సూచించారు. మొదటి, రెండో డోసులు కోవాగ్జిన్, కొవి షీల్డ్.... వీటిలో ఏది తీసుకున్నప్పటికీ బూస్టర్ డోసుగా కార్బో వ్యాక్సీన్ ను తీసుకోవచ్చునని తెలిపారు. కొంతకాలంగా వ్యాక్సీన్ ల కొరత కారణంగా బూస్టర్ డోసుల పంపిణీ నిలిచిపోయింది. తాజాగా హైదరాబాద్ కు చెందిన వ్యాక్సీన్ తయారీ సంస్థ బయోలాజికల్ ఈ నుండి 5 లక్షల కార్బో వ్యాక్సీన్ డోసులను ప్రభుత్వం కొనుగోలు చేసింది.