Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వివేకా కూతురు సునీత భర్త రాజశేఖర రెడ్డి హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. నేడు భాస్కర్ రెడ్డి, ఉదయ్ ల విచారణ ముగిసిన అనంతరం సీబీఐ అధికారుల వద్దకు రాజశేఖర రెడ్డి వెళ్లారు. వివేకా రెండో భార్యగా చెబుతున్న షమీమ్ సీబీఐ అధికారుల ఎదుట తన స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇందులో సునీత భర్త, సోదరుడి పైన ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. రాజశేఖర రెడ్డి, ఆయన సోదరుడు తనను చాలాసార్లు బెదిరించినట్లు షమీమ్ వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలో రాజశేఖర రెడ్డి సీబీఐ కార్యాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.