Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో మరో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. తీవ్ర ఉత్కంఠ నెలకొన్న బెంగళూరు జయనగర్ నియోజకవర్గ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. తొలుత వ్యతిరేకంగా వచ్చిన ఫలితాలపై బీజేపీ అభ్యర్థి రామమూర్తి రీకౌంటింగ్ కు అభ్యర్థించగా.. మరోమారు ఓట్లను లెక్కించిన అధికారులు 16 ఓట్ల స్వల్ప మెజారిటీతో రామమూర్తి గెలుపొందారని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రీకౌంటింగ్ సందర్భంగా మోసపూరితంగా ఫలితాన్ని మార్చేశారంటూ అధికారులపై ఆరోపణలు గుప్పించారు.