Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 15,2023

బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు

- బీజేపీ రాజకీయాలతో భారత్‌కు చేటు
- మోడీ పాలనలో తిరోగమన పరిస్థితులు
- పలు రంగాలను భ్రష్టు పట్టిస్తున్న కాషాయ పార్టీ
- రాజకీయ విశ్లేషకులు, నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ : ఢిల్లీలోని అత్యంత భద్రతతో కూడిన తీహార్‌ జైలులో టిల్లు తాజ్‌పురియా అనే వ్యక్తి హత్యకు సంబంధించిన వార్తలను వారం రోజులుగా హిందీ వార్తాపత్రికలు వరుసగా అందించాయి. హతుడిని 50 సార్లు పొడిచిన విధానాన్ని వివరించాయి. జైలులో ఇంత ఘోరం జరిగినా పోలీసులు మాత్రం అడ్డుకోలేకపోయారు. తీహార్‌ జైలులో ముఠాలు, ముఠా నాయకుల ఉనికి గతంలో దేశంలో నెలకొని ఉన్న కఠినమైన రోజులను గుర్తు తెస్తున్నది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత, శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గత కొన్నేండ్లుగా ఆ పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయన్నారు. వ్యాపారం, రాజకీయం, క్రీడలు, బ్యూరోక్రసీ, వినోదం, సాహిత్య ప్రపంచం.. ఇలా రంగమేదైనా బీజేపీ నాయకుల రంగప్రవేశంతో అవి కలుషితమవుతున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు.
బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ వ్యవహారం
          బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై మహిళా అథ్లెట్ల లైంగిక ఆరో పణలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇది దేశం దృష్టిని ఆకర్షించింది. న్యూఢిల్లీలోని జంతరమంతర్‌ వద్ద జరుపుపుతున్న మహిళా అథ్లెట్ల నిరసనలకు అన్ని రంగాల నుంచి మద్దతు లభించింది. బ్రిజ్‌ భూషణ్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌ పెరిగింది. అయితే, బ్రిజ్‌ భూషణ్‌ తాను రాజీనామా చేసేది లేదని తెలి పాడు. దేశరాజధానిలోనే ఇంత తతంగం జరుగుతున్నా.. కేంద్రంలోని మోడీ సర్కారుకు కానీ, బీజేపీ పార్టీ పెద్దలకు గానీ ఇదేదీ కనిపించకపోవడం గమనార్హం. ఇలాంటి తరుణంలో నెటిజన్లు మోడీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మణిపూర్‌ హింసాత్మకం
          ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అట్టుడికిపోతున్నది. గిరిజన, గిరిజనేతరుల మధ్య జరిగిన ఘర్షణలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర హింసకు దారి తీశాయి. 50 కంటే ఎక్కువ మంది వ్యక్తుల మరణానికి దారి తీశాయి. వందలాది మంది గాయాల పాలయ్యారు. ''జాతీయ ప్రతిష్ట'' దెబ్బ తిన్నది. భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ గొడవలను నివారించడంలోనూ, అదుపు చేయటంలోనూ విఫలమైంది. సాక్షాత్తూ బీజేపీ పార్టీ కింది స్థాయి కార్యకర్తలే బీజేపీ బలహీన తీరును విమర్శించారు. మణి పూర్‌లో ఇంత గొడవ జరుగుతున్నా.. ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాలు మాత్రం ఇవేమీ పట్టనట్టుగా ఎన్నికల్లో లబ్ది పొందటమే లక్ష్యంగా కర్నాటక ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. మోడీ సర్కారు తీరుపై రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.
కర్నాటకలో 40 శాతం కమీషన్‌ వ్యవహారం
          కర్నాటకలో బీజేపీ ''డబుల్‌-ఇంజిన్‌'' సర్కారు పట్ల ప్రజలు విసుగు చెందారు. ముఖ్యంగా, అక్కడ 40 శాతం కమీషన్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ కోపాన్ని కన్నడ ఓటరు ఓటుతో తీర్చుకున్నాడు. ఈ విషయాన్ని ఈనెల 10న అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం అనేక ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలే స్పష్టం చేశాయి. దాదాపు అన్ని సర్వేల్లో కాంగ్రెస్‌ అతి పెద్ద పార్టీగా అవతరిండం గమనార్హం. దీంతో కన్నడిగులు మళ్లీ బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టడానికి ఇష్టంతో లేరనేది స్పష్టమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు అంటున్నారు. మోడీ, షా, యోగి త్రయం ప్రచారం చేసినా ఓటర్లను అనుకున్నంత ప్రభావితం చేయలేకపోయారని తెలుస్తోంది..
ఆరెస్సెస్‌ కార్యకలాపాలు
          ఇటు బీజేపీ మాతృ సంస్థగా చెప్పబడే ఆరెస్సెస్‌ తన అనుబంధ సంస్థ లతో హింసకు పాల్పడుతున్నదని విశ్లేషలు వెలువడుతున్నాయి. నాగ్‌పూర్‌ కేంద్రంగా అనేక కుట్రలు తెరలేపుతున్నదని చెప్పారు. బజరంగ్‌దళ్‌ వంటి హిందూత్వ సంస్థలను అల్లర్లకు ఎగదోస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సంస్థల కారణంగానే కర్నాటకలో హిజాబ్‌ వివాదం చెలరేగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.. అలాగే, తన విద్యార్థి విభాగంతో ఢిల్లీ, జేఎన్‌యూ వంటి యూనివర్సిటీల్లో గొడవలకు కారణమైందన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !
రైతుల చారిత్రాత్మక విజయానికి అభినందనలు

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.