Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కర్నాటక జోష్‌ కొనసాగేనా? | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 17,2023

కర్నాటక జోష్‌ కొనసాగేనా?

- ప్రాభవం కోల్పోతున్న బీజేపీ
- కాంగ్రెస్‌ను వేధిస్తున్న అంతర్గత కుమ్ములాటలు
న్యూఢిల్లీ : కర్నాటక ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు మరో ఐదు రాష్ట్రాలలో... మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘర్‌, రాజస్థాన్‌, తెలంగాణ, మిజోరంలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీ పీఠం చేరేందుకు ఈ రాష్ట్రాలు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షగా నిలిచాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలండ్‌, కర్నాటక రాష్ట్రాలలో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి. మిజోరంలో డిసెంబర్‌ 17న, ఛత్తీస్‌ఘర్‌లో వచ్చే సంవత్సరం జనవరి 3న, మధ్యప్రదేశ్‌లో జనవరి 6న ఆయా శాసనసభల కాలపరిమితి ముగుస్తుంది. రాజస్థాన్‌ శాసనసభ కాలపరిమితి జనవరి 14న, తెలంగాణ శాసనసభ కాలపరిమితి జనవరి 16న ముగియనుంది. ఈ రాష్ట్రాలలో జరిగే ఎన్నికలకు ఇంకా షెడ్యూల్‌ విడుదల కానప్పటికీ అన్ని రాష్ట్రాలలోనూ నవంబర్‌-డిసెంబర్‌ మధ్య కాలంలోనే పోలింగ్‌ జరుగుతుందని అంచనా. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి, లోక్‌సభ ఎన్నికలలో సత్తా చాటాలని తహతహలాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి కర్నాటక ఫలితాలు కొత్త జోష్‌నిచ్చాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న కొన్ని అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. వీటిని అధిగమించి పార్టీ విజయ తీరాలకు చేరుతుందా? బీజేపీ పతనం ప్రారంభమైందా? అనేవి ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు.
మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోరు జరిగే అవకాశం ఉంది. ఆ రాష్ట్ర శాసనసభలో 230 స్థానాలు ఉన్నాయి. కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పతనమైన నాలుగు సంవత్సరాల తర్వాత అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీ ఫిరాయింపు రాజకీయాలతో ఆ పతనమైంది. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నాయకత్వాన బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
రెండు వందల స్థానాలున్న రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం స్థిరంగానే కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి గెహ్లాట్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అంతర్గత కుమ్ములాటలు పార్టీ అధినాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదురుస్తూ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు. గెహ్లాట్‌ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి పైలెట్‌తో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో మాదిరిగానే రాజస్థాన్‌లో కూడా బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉంది.
ఛత్తీస్‌ఘర్‌లో కూడా కాంగ్రెస్‌ను వర్గ పోరు కలవరపెడుతూనే ఉంది. 2018 ఎన్నికలలో భూపేష్‌ భాగల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగా ఆయనకు, ఆరోగ్య మంత్రి టీఎస్‌ సింగ్‌ దేవ్‌కు మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. 90 స్థానాలున్న శాసనసభలో కాంగ్రెస్‌ 68 సీట్లతో తిరుగులేని ఆధిపత్యం కనబరచినా ఈ అనైక్యత చీకాకు తెప్పిస్తున్నది. బీజేపీ విషయానికి వస్తే సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రానికి నేతృత్వం వహించిన రమణ్‌ సింగ్‌ పైనే ఆ పార్టీ ఆధారపడుతోంది. ఎన్నికలకు ముందు సీనియర్‌ గిరిజన నేత నంద్‌కుమార్‌ శారు పార్టీకి గుడ్‌బై చెప్పడం ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా భావించవచ్చు.
ఇక తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ. బీజేపీ ఆశలను కర్నాటక ఫలితాలు నీరుగార్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికలలో దేశవ్యాప్తంగా విస్తరించి, జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే పలువురు జాతీయ ప్రతిపక్ష నేతలతో సమాలోచనలు జరిపారు.
ఇక మిజోరంలో అధికారంలో ఉన్న మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) కేంద్రంలో ఎన్డీఏలోనూ, రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌ఈడీఎలోనూ భాగస్వామిగా కొనసాగుతోంది. రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఎంఎన్‌ఎఫ్‌ 26 స్థానాలు (మొత్తం స్థానాలు 40) గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌కు కేవలం ఐదు సీట్లు మాత్రమే దక్కాయి. రాష్ట్రంలో బీజేపీ మొదటిసారిగా ఖాతా తెరిచింది. కాగా, నిన్న హిమాచల్‌ప్రదేశ్‌లో నేడు కర్నాటకలో తగిలిన ఎదురుదెబ్బలు, తీవ్రమైన ప్రజావ్యతిరేకత, పెరుగుతున్న ప్రతిపక్షాల ఐక్యత, వికటిస్తున్న హిందూత్వ బీజేపీ ప్రాభవానికి సవాలుగా మారాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !
రైతుల చారిత్రాత్మక విజయానికి అభినందనలు

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.