Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఫ్లాప్‌ షో..! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 15,2023

ఫ్లాప్‌ షో..!

- మోడీ అన్నీ తానై ప్రచారం చేసినా ఫలితం శూన్యం
- ఓట్లు రాల్చని హిందూత్వ కార్డు
- విలక్షణ తీర్పు ఇచ్చిన కన్నడిగులు
మోడీ గారడీ ఏ మాత్రం పని చేయలేదు. మోడీ విశేష జనాదరణ కలిగిన నాయకుడని, బీజేపీ విజయం ఆయన పైనే ఆధారపడి ఉందని చాలా మంది విశ్వసిస్తుంటారు. అయితే ఆయన పైనే ఆధారపడడం పెద్ద తప్పిదమని కర్నాటక ఫలితాలు నిరూపించాయి. యడియూరప్ప వంటి ప్రజాబాహుళ్యం కలిగిన నాయకుడిని పక్కనపెట్టి, బజరంగబలి పేరిట ఓట్లు కొల్లగొట్టాలని బీజేపి కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. అయితే ఇది యాధృచ్చికంగా జరిగినదేమీ కాదు. రాష్ట్ర నాయకత్వాలు బలంగా ఉండడం ఆధిష్టానానికి సుతరామూ ఇష్టం లేదు. మోడీని మాత్రమే ముందుకు తేవాలని ఆ పార్టీ కోరుకుంది. అయితే ఈ ఎత్తుగడ కర్నాటకలో బెడిసికొట్టింది. స్థానిక నేతలను విస్మరించి, అంతా తానై మోడీ జరిపిన ఎన్నికల ప్రచారం బీజేపీకి ఏ మాత్రం ఉపయోగపడలేదు సరికదా వికటించింది.
బెంగళూరు : ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్నాటకలో ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కుపెట్టిన బాణాలు గురి తప్పాయి. బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన తర్వాత పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారిందంటూ కార్పొరేట్‌ మీడియా ఊదరగొట్టింది. రాష్ట్రంలో పట్టు కోల్పోతున్న బీజేపీకి కాంగ్రెస్‌ హామీ ఊపిరి పోసిందంటూ వ్యాఖ్యలు చేసింది. మరో వారంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా మోడీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన జరిపారు. రోడ్‌షోలు, బహిరంగ సభలతో హోరెత్తించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని పదేపదే ప్రస్తావిస్తూ హిందూత్వ కార్డును బయటికి తీశారు. జాతీయ మీడియాలో ఈ విషయానికి విశేష ప్రాధాన్యత లభించింది. అయితే పోలింగ్‌ రోజున ప్రజలు ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని ఫలితాలు రుజువు చేశాయి. కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ అందిస్తూ కన్నడిగులు విలక్షణ తీర్పు ఇచ్చారు.
చేతులు కాలాక...
           పైగా బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వం పలు సందర్భాలలో హిందూత్వ విధానాలను అవలంబిం చడం ప్రజలకు ఆగ్రహం కలిగించింది. పాఠశాలలకు వెళ్లే ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించకుండా అడ్డుకోవడం, హలాల్‌పై నిషేధం విధించడం, 18వ శతాబ్దిలో మైసూర్‌ను పాలించిన టిప్పు సుల్తాన్‌ ఒక్కలిగుల చేతిలో హత్యకు గురయ్యారంటూ కల్పిత కథను ప్రచారం చేయడం వంటి చర్యలు బీజేపీ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీశాయి. హిందూత్వ కార్డును ప్రయోగించడం వల్ల బీజేపీకి నష్టం జరగవచ్చునని ఎన్నికలకు కొద్ది వారాల ముందే బొమ్మై గ్రహించారు. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. మరోవైపు ముస్లిం ఓటర్లు పూర్తిగా కాంగ్రెస్‌ వైపు సంఘటితమయ్యారు. మైనారిటీలు గతంలో కంటే ఇప్పుడు పది శాతం ఎక్కువగా కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని సర్వేలు తేల్చేశాయి.ఏదేమైనా ఎన్నికల ఫలితాలు బీజేపీ హిందూత్వ వాదనను వెనక్కి నెట్టాయి. హిజాబ్‌పై నిషేధం విధించడానికి ప్రధాన కారకుడైన మంత్రి బీసీ నగేష్‌ ఓడిపోయారు. సుఫీల ప్రార్థనా మందిరంపై వివాదాన్ని సృష్టించిన బీజేపీ నాయకుడు సీటీ రవికి కూడా పరాజయం తప్పలేదు. హలాల్‌పై నిషేధం విధించడాన్ని ఆయన సమర్ధించారు కూడా. హిందువుల ప్రాబల్యం అధికంగా ఉండే కొడగూ ప్రాంతంలోని రెండు స్థానాలనూ కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఆర్థిక ఇబ్బందులతో అష్టకష్టాలు పడుతున్న హిందూ ఓటర్లను హిందూత్వ నినాదం ఏ మాత్రం ఆకర్షించలేకపోయింది.
స్థానిక నాయకత్వాన్ని విస్మరించి...
           మరో ముఖ్యమైన విషయమేమంటే ప్రతి దానికీ అధిష్టానం పైనే ఆధారపడడం కూడా బీజేపీ కొంప ముంచింది. ప్రచారం చివరి దశలో కాంగ్రెస్‌ పార్టీ 'నందిని' పాల అంశాన్ని తెర పైకి తెచ్చింది. కర్నాటక పాల ఉత్పత్తిదారుల సహకార సంస్థ అయిన నందినిని బలహీనపరచి, గుజరాత్‌ కు చెందిన అమూల్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్న బీజేపీ ప్రభుత్వ ప్రయత్నం పాత మైసూర్‌ ప్రాంతంలో కొంత ప్రభావం చూపింది. ఆర్థికపరంగా ఎదు రైన సవాళ్లు, పెరగని వేతనాలు, ద్రవ్యోల్బణం వంటివి కర్నాటక ఫలితంపై ప్రభావం చూపాయి. ఇన్ని ప్రతికూలతల నడుమ రాబోయే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ఎలా సమాయత్తమవుతుందో వేచి చూడాల్సిందే.
అందరిలోనూ అసంతృప్తే
           అయితే ఇదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. మత జాతీయతావాదం మాదిరిగానే హిందూత్వ కూడా భావోద్వేగాలపై ఆధారపడిన అంశం. అనేక హింసాత్మక నేరాలకు పాల్పడిన బజరంగ్‌దళ్‌ను బజరంగ్‌బలితో పోల్చడం ఓటర్లకు ఏ మాత్రం రుచించలేదు. వాస్తవానికి ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసిన విషయం రాష్ట్ర ఆర్థిక దుస్థితి. నిరుద్యోగ సమస్య కారణంగా పట్టణ ఓటర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరోవైపు సంక్షేమ ఫలాలు అందకపోవడంతో రైతులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ద్రవ్యోల్బణం ప్రభావంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై బీజేపీ మద్దతుదారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సమస్యల వలయంలో చిక్కుకుపోవడంతో కులాల ఆధారంగా ఓట్లు వేసే పద్ధతికి స్వస్తి చెప్పారు.
కోటా పెంచినా దక్కని ఫలితం !
ఎస్సీ, ఎస్టీ సీట్లలో రాలని ఓట్లు
ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని, ఎస్సీలకు అంతర్గతంగా రిజర్వేషన్లు కల్పించాలని కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ప్పటికీ ఆ వర్గాల ఓట్లను రాబట్టలేకపోయింది. రాష్ట్రంలోని 51 రిజర్వ్‌డ్‌ స్థానాలలో ఆ పార్టీకి దక్కింది కేవలం 12 మాత్రమే. 2018 ఎన్నికలలో బీజేపీ 22 రిజర్వ్‌డ్‌ స్థానాలను గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు బీజేపీ ప్రభుత్వం ఎస్సీల రిజర్వేషన్లను 15శాతం నుండి 17శాతం, ఎస్టీల రిజర్వేషన్లను 3శాతం నుంచి 7శాతం పెంచింది. 2018 ఎన్నికలలో బీజేపీ 16ఎస్సీ స్థానాలు, 6 ఎస్టీ స్థానాలు గెలుచుకోగా ఈ ఎన్నికలలో 12 ఎస్సీ స్థానాలు మాత్రమే లభించాయి. ఎస్టీ అభ్యర్థులలో ఒక్కరు కూడా గెలవ లేదు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ 21 ఎస్సీ సీట్లు, 14 ఎస్టీ సీట్లు గెలుచు కుంది. 2018 ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి 15 రిజర్వ్‌డ్‌ స్థానాలు అదనం గా లభించాయి. ఏ కులానికైనా రిజర్వేషన్లు పెంచాలన్నా లేదా తగ్గించాల న్న సుదీర్ఘమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని, శాస్త్రీయ గణాం కాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పీసీసీలో సామాజిక న్యాయ విభాగం అధ్యక్షుడు సీఎస్‌ ద్వారకానాథ్‌ చెప్పారు. అయితే బీజేపీ ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి గణాంకాలు అందు బాటులో లేవని విమర్శించారు. యాభై శాతం పరిమితిని మించి రిజర్వేష న్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణను తీసుకొచ్చే విషయంలో బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించలేదు. దీంతో ప్రభుత్వ ఉద్దేశంపై ఎస్సీ లు, ఎస్టీలలో అనుమానాలు రేకెత్తించేం దుకు కాంగ్రెస్‌, జేడీ (ఎస్‌)లకు ఆయుధం దొరికినట్లయింది. అయితే రిజర్వేషన్ల పెంపుపై కర్నాటక బీజేపీ లేఖ రాసినప్పటికీ 50 శాతానికి మించి పెంచే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర మంత్రి ఎ. నారాయణస్వామి లోక్‌సభకు తెలియజేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీలలో మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !
రైతుల చారిత్రాత్మక విజయానికి అభినందనలు

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.