Authorization
Sat May 03, 2025 12:34:47 pm
- ఎంపీడీవో శరత్ చంద్రబాబు
నవతెలంగాణ-కొత్తూరు
ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీలలో చదువుకునే నిరు పేద విద్యార్థులకు సరైన పోషకాహారం అందించాలని ఎంపీడీవో శరత్ చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన మండలంలోని పెంజర్ల గ్రామపంచాయతీలో జరు గుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అంగ న్వాడీ పాఠశాల ఆవరణలో విద్యార్థులకు సరైన పోషకా హారం అందించాలనే నేపథ్యంలో నిర్వహిస్తున్నా కిచెన్ గార్డెన్ను ఆయన పరిశీలించి సలహాలు సూచనలు చేశారు. అలాగే అంగన్వాడీ విద్యార్థుల కోసం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా నిర్మించిన మరుగుదొడ్డి పనులను పరిశీలించి అంగన్వాడీ సిబ్బంది పంచాయతీ సిబ్బందికి పరిశుభ్రత పట్ల తగిన సూచనలు చేశారు. కార్య క్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేందర్, అంగన్వాడీ సిబ్బంది తదితరులు ఉన్నారు.