Authorization
Thu May 01, 2025 04:22:17 pm
- ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్
నవతెలంగాణ-ఆమనగల్
అనారోగ్యంతో బాధపడుతున్న వారు ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఆమనగల్ మార్కెట్ యార్డు ఆవరణలో స్థానిక నాయకులతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్లు యాదయ్య, సులోచన సాయిలు, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు నిట్ట నారాయణ, ఎస్సీ,ఎస్టీ మానిటరింగ్ సభ్యుడు నేనావత్ పత్య నాయక్, కౌన్సిలర్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కమటం రాధమ్మ వెంకటయ్య, నాయకులు చుక్క నిరంజన్ గౌడ్, గుత్తి బాలస్వామి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.